మెల్బోర్న్, ఏప్రిల్ 27: భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. తక్షణం అమల్లోకి వచ్చే ఈ నిషేధం వచ్చే నెల 15 వరకు కొనసాగనున్నదని పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్న భారత్కు అండగా ఉంటామని వివరించారు. మరోవైపు భారత్లో చేపట్టే కరోనా పరీక్షల్లో కచ్చితత్వం లోపిస్తున్నదని ఆస్ట్రేలియాకు చెందిన ఓ అధికారి చెప్పారు.