క్యాపిటల్ హిల్ హింస: త్రివర్ణ పతాకం ఎందుకు కనిపించింది?

వాషింగ్టన్: అమెరికాలోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలుసు కదా. ఈ హింసలో నలుగురు చనిపోగా.. ఎంతో మంది గాయపడ్డారు. ఇది ట్రంప్ చేసిన తిరుగుబాటుగా చాలా మంది అభివర్ణించారు. అయితే ఈ నిరసనల్లో ఒక వీడియో ఇప్పుడు ఇండియన్స్ను ఆకర్షించింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని కనిపించడం గమనార్హం. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏ పార్టీకి చెందినవాడన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కానీ అమెరికా ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఇండియన్ ఫ్లాగ్ కనిపించడానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. అక్కడ మన జెండా ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు బీజేపీ లోక్సభ ఎంపీ వరుణ్ గాంధీ. ఈ పోరాటంలో మనం పాలుపంచుకోవాల్సిన అవసరం అసలే లేదంటూ ఆయన ట్వీట్ చేశారు.
Why is there an Indian flag there??? This is one fight we definitely don’t need to participate in... pic.twitter.com/1dP2KtgHvf
— Varun Gandhi (@varungandhi80) January 7, 2021
తాజావార్తలు
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
- బ్రిస్బేన్లో వర్షం.. ముగిసిన నాలుగో రోజు ఆట
- ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
- కంగనా యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- కూకట్పల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
- ఐపీఎల్లో కొత్తగా ఒక్క టీమే!
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం
- కేసులతో విసిగి హిస్టరీ షీటర్ ఆత్మహత్య
- స్వచ్ఛ సిద్దిపేటే లక్ష్యం : మంత్రి హరీష్ రావు