ఒట్టావా: పాకిస్థాన్లో మైనారిటీ హక్కుల ఉల్లంఘనపై కెనడాలోని భారతీయులు మండిపడ్డారు. టొరంటోలోని పాకిస్థాన్ కాన్సులేట్ ఎదుట శనివారం నిరసన తెలిపారు. పాకిస్థాన్లోని మైనార్టీలైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్ బాలికలు, మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ ఉగ్రవాదం నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ప్రవాస భారతీయులు నినదించారు. ఆప్ఘనిస్థాన్లోని తాలిబన్లకు పాక్ మద్దతు ఇవ్వడాన్ని ఖండించారు. ఈ మేరకు పలు ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.