ఖమ్మం/ ఖమ్మం కల్చరల్, ఏప్రిల్ 19: రానున్న రోజుల్లో కూడా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఖమ్మం పౌరసేవా సమితి అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ జన్మదిన వేడుకలు ఖమ్మం పౌరసేవా సమితి, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా ఖమ్మంలోని మంత్రి స్వగృహంలో ఆయనను కలుసుకున్న పులిపాటి ప్రసాద్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. వత్సవాయి రవి, మంత్రిప్రగడ జగన్మోహన్రావు, వైవీ రావు, ఆంజనేయప్రసాద్, కొల్లు పద్మ, ఎస్కే ఖాసీం, పద్మజారెడ్డి, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.
నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నగరంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన స్వయంభు స్వామిని దర్శించుకుని విశేష పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి
నోముల భగత్ కుటుంబీకులకు, ఎంసీ కోటిరెడ్డికి కరోనా
యువ హీరోతో అనిల్రావిపూడి చిత్రం..?