డెహ్రాడున్ జూన్ 25 :ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆ చాంపియన్ పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. సరైన ప్రోత్సాహం, సహకారం అందక రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితితులను ఎదుర్కొంటున్నదామె. ఉత్తరాఖండ్లోని డెహ్రాడున్ కు చెందిన దిల్రాజ్ కౌర్ తన 17 ఏండ్ల కెరీర్ లో 35పతకాలు సాధించింది. వీటిలో 28 బంగారు పతకాలు, 6 కాంస్య పతకాలను గెలుచుకుంది. 2007, 2015 లో జరిగిన వరల్డ్ గేమ్స్ లో మరో రెండు మెడల్స్ ను ఆమె సాధించింది. ఇప్పుడు ఆమె ఆర్థికపరిస్థితి బాగోలేదు. దీంతో తన కుటుంబ పోషణ కోసం డెహ్రాడున్ లోని గాంధీ పార్క్ వద్ద దిల్రాజ్ కౌర్ ఆమె తల్లి తినుబండారాలు అమ్ముతున్నారు.
2005లో క్రీడా రంగంలో ప్రవేశించి….
దేశానికి అవసరమైనప్పుడు ఆమె నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి.. దేశ కీర్తిని పెంచారు. కానీ ఇప్పుడు ఆమె కటిక పేదరికం అనుభవిస్తూ.. సాయం కోసం ఎదురు చూస్తుంటే ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఇలాంటి కష్ట కాలంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన ఓ చిన్న బండి మీద చిప్స్, బిస్కట్ ప్యాకెట్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నది దిల్రాజ్ కౌర్. 2005లో క్రీడా రంగంలో ప్రవేశించిన ఆమె 2015 వరకు విజయవంతంగా కొనసాగింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని 28కి పైగా పతకాలు గెలుచుకున్నది. అయితే ఆ పతకాలుగానీ స్థాయి కానీ ఆమె కష్టాలు తీర్చలేదు. ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఆర్థిక సాయం కానీ.. ఉద్యోగం ఇవ్వడం కానీ చేయలేదు. ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన బండి పెట్టుకుని చిప్స్, బిస్కెట్లు అమ్ముతున్నారు. ఒకప్పుడు దేశంలోనే గొప్ప పారా ఎయిర్ పిస్టల్ షూటర్గా నిలిచిన ఆమె.
దిల్రాజ్ కౌర్ ఆవేదన…
‘‘దేశానికి అవసరం ఉన్నప్పుడు నేను ముందుకు వచ్చాను. ఎన్నో పతకాలు సాధించాను. కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఉత్తరఖండ్ ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయంఅందలేదు. నా విజయాల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగానికి అప్లై చేశాను. కానీ ప్రతిసారి తిరస్కరించారు. ప్రస్తుతం నేను మా అమ్మతో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంట్కు ఉంటున్నాను.” అని దిల్రాజ్ కౌర్ ఆవేదన వ్యక్తంచేసింది. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదు. ఇల్లు గడవడం కోసం ఇలా రోడ్డు పక్కన చిప్స్, బిస్కెట్లు అమ్ముతున్నాను’’ అని దిల్రాజ్ కౌర్ తన బాధలను పంచుకున్నది.