భారత్-బంగ్లా సరిహద్దు సమస్యలపై ఈ నెల 22న చర్చలు

న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు సమస్యలపై చర్చించేందుకు డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు ఈ నెలాఖరులో సమావేశం కానున్నారు. ద్వివార్షిక సమావేశం తొలిసారి ఢిల్లీ వెలుపల గౌహతిలో ఈ నెల 22 న జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) మధ్య జరుగనున్నాయి. వివిధ రకాల సరిహద్దు నేరాలను అరికట్టడం, ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచడంపై చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ చర్చలు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి.
బీఎస్ఎఫ్ గౌహతి సరిహద్దు ప్రధాన కార్యాలయానికి అస్సాం రాజధాని స్థావరం. దీని దళాలు 4,096 కిలోమీటర్ల పొడవైన భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో 495 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలతోపాటు నడుస్తాయి. అసోంలోని ధుబ్రితో పాటు నదీ సరిహద్దు ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండే ప్రత్యేక బీఎస్ఎఫ్ వాటర్ వింగ్ సరిహద్దు దళం ఆధ్వర్యంలో ఈ సరిహద్దు ఉన్నది. 1993 తర్వాత ఈ ద్వివార్షిక చర్చలు ఢిల్లీ వెలుపల జరగడం ఇదే మొదటిసారి అని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు సమీపంలో జరుగుతున్న ఈ సమావేశం ఇరుపక్షాల ఉన్నతాధికారులు సంయుక్తంగా అసోంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించడానికి అవకాశం ఇస్తాయని వారు చెప్తున్నారు.
డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు ఏటా 1975 నుంచి 1992 మధ్య జరిగాయి. 1993 లో వీటిని ద్వివార్షికంగా మార్చారు. ఇరువైపులా ప్రత్యామ్నాయంగా ఇరుదేశాల రాజధానులు న్యూఢిల్లీ, ఢాకాలను ఎంచుకున్నారు. ఈ చర్చల కోసం బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్థానా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సెప్టెంబర్ నెలలో ఢాకాను సందర్శించింది. అస్తానా తన బీజీబీ కౌంటర్ మేజర్ జనరల్ షఫీనుల్ ఇస్లాంతో మరోసారి చర్చలకు నాయకత్వం వహిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాలు, దళాల మధ్య ప్రస్తుత సంబంధాలు చాలా బాగున్నాయని, ఈ చర్చల సందర్భంగా ఇరువర్గాలు వాటిని మరింత ముందుకు తీసుకెళ్తాయని అధికారులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రవితేజ 'హల్వా డాన్స్' అదిరింది..వీడియో
- మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి గంగుల
- హింస ఆమోదయోగ్యం కాదు: పంజాబ్ సీఎం
- భూ తగాదాలతో వ్యక్తి హత్య
- యాదాద్రిలో భక్తుల రద్దీ..
- పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!
- తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో
- కాళేశ్వరం నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ
- అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు షురూ!
- రియల్మీ X7 సిరీస్ విడుదల తేదీ ఖరారు!