అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్నైట్ స్టార్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా చాలా కలిసొచ్చింది. ఎటొచ్చి చిత్రంలో కథానాయికగా నటించిన షాలినీ పాండేకు మాత్రం బెడిసి కొట్టింది. తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. మహానటి, 118 వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించిన ఈ అమ్మడు కోలీవుడ్పై దృష్టి పెట్టింది. తమిళంలో 100 పర్సెంట్ కాదల్ (100 పర్సెంట్ లవ్ రీమేక్) సినిమాలో హీరోయిన్గా షాలినీ నటించి మంచి మార్కులు కొట్టేశారు.
సినిమా ఆఫర్స్ పెద్దగా లేకపోవడంతో షాలినీ పాండే సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తోంది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే షాలిని తాజాగా బుల్లి నెక్కర్లో వింత ఎక్స్ప్రెషన్స్తో దిగిన ఫొటోని షేర్ చేసింది. ఈ ఫొటో అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. జయేష్ భాయ్ జోర్దార్ అనే సినిమాతో పలకరించేందుకు రెడీగా ఉంది షాలిని.