న్యూయార్క్: మయన్మార్లో ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వందలాది మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో మయన్మార్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఆ దేశానికి ఆయుధాలను సరఫరా చేయవద్దు అంటూ తీర్మానించారు. 119 దేశాలు ఓటింగ్లో పాల్గొన్నాయి. దాంట్లో బెలారస్ ఒక్కటే ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది. మయన్మార్తో లింకు ఉన్న అనేక దేశాలు ఆ తీర్మానంపై ఓటు వేసేందుకు నిరాకరించాయి. ఇండియా కూడా యూఎన్ తీర్మానంపై ఓటింగ్ను బహిష్కరించింది. యూఎన్ అసెంబ్లీలో దీనిపై భారత అంబాసిడర్ టిఎస్ తిరుమూర్తి మాట్లాడారు. మిత్రదేశాలను, ప్రాంతీయ దేశాలను సంప్రదించకుండానే హడావుడిగా మయన్మార్పై తీర్మానం చేశారని ఆయన అన్నారు. మయన్మార్లో ఉన్న రాజకీయ అస్థిరతపై భారత్ అవగాహనతో ఉందన్నారు. ఏషియాన్ దేశాల సహకారంతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలన్నారు.