న్యూఢిల్లీ, మార్చి 25: వరుసగా రెండోరోజూ పెట్రో ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం లీటరు పెట్రోలుపై 21 పైసలు, లీటరు డీజిల్పై 20 పైసలు తగ్గింది. ఆరునెలల్లో మొదటిసారిగా బుధవారం లీటరు పెట్రోల్పై 18 పైసలు, లీటరు డీజిల్పై 17 పైసలు తగ్గిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో చమురు ఉత్పత్తి సంస్థలు పెట్రోల్ ధరలను తగ్గించేందుకు నిర్ణయించాయి. అయితే చమురు ధరల నిష్పత్తిలో పెట్రో ధరలు తగ్గలేదు.