కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ కూడా పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో ఆ దేశ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులు భయాందోళన చెందుతున్నారు. తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. తాలిబన్లు తనలాంటి వారిని కచ్చితంగా చంపుతారని ఆఫ్ఘనిస్థాన్ తొలి మహిళా మేయర్ జరీఫా గఫారీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘తాలిబన్లు నాలాంటి వ్యక్తుల కోసం వచ్చి చంపుతారు. వారి రాక కోసం నేను ఎదురు చూస్తున్నా. వారు వచ్చే వరకు నేను నా ఇంట్లోనే ఉంటాను. నాకు, నా కుటుంబానికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. అందుకే నేను నా భర్త, కుటుంబంతో కలిసి ఇంట్లో ఉన్నాను. తాలిబన్లు నాలాంటి వారి కోసం వెదికి చంపుతారు. నేను నా కుటుంబాన్ని వదిలి వెళ్ళలేను. ఏయినా నేను ఎక్కడికి వెళ్లగలను?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
27 ఏండ్ల జరీఫా గఫారీ, 2018లో ఆఫ్ఘనిస్థాన్ తొలి మహిళా మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. తన దేశ భవిష్యత్తు బాగా ఉంటుందని మూడు వారాల కిందట ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాలిబన్లు కాబూల్ను కూడా ఆక్రయించడంతో తన చావు తప్పదని భయాందోళన చెందుతున్నారు.