వాషింగ్టన్: కరోనా వైరస్పై తాను చెప్పిందే నిజమైందని అన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ చైనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ, శత్రువుగా భావించే వాళ్లు కూడా అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది నిజమని, చైనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని అంటున్నారని ట్రంప్ అన్నారు. ఈ ల్యాబ్ లీక్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోల్పోయిన ప్రాణాలకు, జరిగిన నష్టానికి చైనా భారీ పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికాతోపాటు ప్రపంచానికి చైనా 10 లక్షల కోట్ల డాలర్లు ఇవ్వాలని ట్రంప్ అన్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ కరోనా వైరస్ సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ ప్రైవేట్ ఈమెయిల్స్ ప్రెస్కు రిలీజ్ చేయడంతో మరోసారి వుహాన్ ల్యాబ్పై చర్చ మొదలైంది. 3 వేలకుపైగా పేజీల ఫౌచీ ఈమెయిల్స్ను ప్రముఖ మీడియా సంస్థలైన వాషింగ్టన్ పోస్ట్, బజ్ఫీడ్, సీఎన్ఎన్లు ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సంపాదించాయి. ఈ ఈమెయిల్స్ గతేడాది జనవరి నుంచి జూన్ మధ్య అంటే కరోనా వైరస్ తొలి రోజులకు సంబంధించినవి.