ఉప్పల్/చర్లపల్లి/మల్లాపూర్, మే 6 : పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్ల చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. నిరుపేద తల్లిదండ్రులు ఆడబిడ్డల పెండ్లి కోసం ఇబ్బందులు పడకూడదని సీఎం కేసీఆర్ ఈ పథకాలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా కృషిచేస్తున్నామని తెలిపారు.
ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నామని, నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ లబ్ధిచేకూరేలా పలు సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే సీఎం దొరకడం అదృష్టమన్నారు. పేదలకు అండగా నిలిచి, వారికి తగిన తోడ్పాటు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ తహసీల్దార్ గౌతమ్కుమార్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, హెచ్బీకాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఆర్ఐలు శాలిని, షాహిన్, నేతలు గరిక సుధాకర్, కృష్ణారెడ్డి, శ్రావణ్రెడ్డి, రాణిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు