ఎమ్మెల్యే అరెకపూడిగాంధీ
రంజాన్ కానుకలు పంపిణీ
మియాపూర్, మే 1 : తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా పండుగలకు కానుకలను అందిస్తూ అందరివాడుగా తమ సీఎం కేసీఆర్ నిలుస్తున్నాడన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఆర్పీ కాలనీ మసీదు వద్ద శనివారం ముస్లింలకు పండుగ కానుకలను కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. రెండేండ్లుగా కరోనా మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, మోజెస్, లింగయ్య, సాలయ్య, విజయ, రాధాబాయి, దేవదాసు, ఇస్మాయిల్, యూసుఫ్, అబ్రహం పాల్గొన్నారు.