-ఎమ్మెల్సీ కవితకు ఉర్దూ టీచర్స్,
-సెర్ప్ ఉద్యోగుల జేఏసీ మద్దతు లేఖలు అందజేత
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు వెల్లువెత్తుతున్నది. అన్నివర్గాల పట్టభద్రులు సంఘాలవారీగా తమ మద్దతు ప్రకటిస్తున్నాయి. తాజాగా గురువారం తెలంగాణ ఉర్దూ టీచర్స్ యూనియన్, సెర్ప్ ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ మేరకు మద్దతు లేఖలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అందజేశాయి. సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు కోసం స్వచ్ఛదంగా పనిచేస్తామని ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుతుబుద్దీన్, కార్యదర్శి షకీల్ అహ్మద్ ప్రకటించారు. రెండు నియోజకవర్గాల్లో తమ అసోసియేషన్కు చెందిన 7 వేల మంది సభ్యులు టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు సెర్ఫ్, ఐకేపీ, ఉద్యోగస్థుల జేఏసీ ప్రతినిధులు ఏ నర్సయ్య, కే గంగాధర్రెడ్డి, జీ మహేందర్రెడ్డి, జీ సుభాష్ ప్రకటించారు. ఎమ్మెల్సీ కవితను కలిసి తమ మద్దతు లేఖ అందజేశారు.