హైదరాబాద్ : కొవిడ్ వంటి విపత్కర సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి.. నిత్యం రోగులకు సేవలు చేస్తున్న నర్సుల సేవలు అనుపమానమైనవని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. నర్సులు చేసే సేవలకు అందరం ఎంతో రుణపడి ఉన్నామనన్నారు.
వారి సేవలు వెలకట్టలేనివి. ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకోవడం, వారి సేవలను గుర్తించడమే మనం వారికి ఇచ్చే గౌరవం అన్నారు. వారికున్న సేవాభావం, కరుణ, శ్రద్ధలే ఈ సమాజాన్ని అనారోగ్యం నుంచి కాపాడుతూ శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు.