వాషింగ్టన్, జూన్ 10: కరోనా వైరస్ ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న సమస్య. దీనిపై అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీకి చెందిన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ సుధీర్కుమార్ ముందడుగు వేశారు. 2019 డిసెంబర్ 24న చైనాలో తొలి కరోనా కేసు నమోదుకాగా.. అంతకు రెండునెలల ముందే అంటే అక్టోబర్లోనే సార్స్కొవ్-2కు మూలమైన వైరస్ ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. దాన్నించి మూడు ఉత్పరివర్తనాల తర్వాత సార్స్కొవ్-2 వైరస్ పుట్టిందని తాము గుర్తించామన్నారు. కొత్త రూపంలో సార్స్కొవ్-2 విపరీతమైన వేగంతో ప్రపంచాన్ని చుట్టేసిందని, అయితే, దాని ‘ముత్తాత’ వైరస్ కూడా ఒకస్థాయిలో వ్యాపించిందని తెలిపారు. ఈ వైరస్ 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకూ ఉనికిలో ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.