న్యూఢిల్లీ: కరోనా కాటుకు మరో ప్రముఖుడు కన్నుమూశారు. ప్రముఖ అస్సామీ రచయిత, సీనియర్ జర్నలిస్ట్, సాహిత్య అకాడమీ విజేత హోమెన్ బొర్గోహైన్ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 88 ఏండ్ల బొర్గోహైన్ గత నెల 24న కరోనా పాటివ్గా నిర్ధారణ అయ్యారు. దీంతో ఆయన గువాహటి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చేరారు. మే 7న కరోనా నెగెటివ్ రావడంతో దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. అయితే కరోనా సమస్యలతో ఇవాళ ఉదయం గువాహటీలోని ఓ నర్సింగ్లో చేరాయి. చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందారు. బొర్గొహైన్ 1932, డిసెంబర్ 7న లఖింపూర్ జిల్లాలోని ధకువాఖానాలో జన్మించారు.
బొర్గొహైన్ మృతిపట్ల అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి