డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి
వ్యాక్సిన్ తీసుకున్న ప్రజాప్రతినిధులు
కొడకండ్ల, ఏప్రిల్8: కరోనా వ్యాక్సిన్పై ప్రజలు అపోహలు వీడి 45 ఏళ్లు పైబడిన వారంతా టీకా వేసుకోవాలని డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి రక్షణలో కరోనా వ్యాక్సిన్ ప్రతి ప్రభుత్వ దవాఖానకు పంపిస్తున్నదని తెలిపారు. అనంతరం ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ రత్నకర్తో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడి కరోనా వ్యాక్సిన్ను నిల్వ చేసే విధానం అడిగి తెలుసుకున్నారు. సూపర్వైజర్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ను ప్రత్యేక ఫ్రీజర్లో నిల్వ చేస్తారని, ఒక వాయిల్ బయటకు తీసే 4 గంటల్లో వినియోగించాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మిట్టపల్లి వీరసోములు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కుందూరు అమరేందర్రెడ్డి పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ ప్రారంభం
స్టేషన్ఘన్పూర్: తాటికొండ, ఇప్పగూడెం గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కారోనా వ్యాక్సిన్ పంపిణీని సర్పంచ్లు చల్లా ఉమాసుధీర్రెడ్డి, మంతెన అజయ్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఇప్పటి వరకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రమే వ్యాక్సిన్ వేసేవారని, ఇకపై తాటికొండ, ఇప్పగూడం పీహెచ్సీల్లోనూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శేఖర్, వైద్యాధికారి విజయ్ కిరణ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కిషన్, సూపర్వైజర్ రమణ, వ్యాక్సినేటర్ సరోజ, కవిత, ఏఎన్ఎం ఆరుణ, అంగన్వాడి టీచర్లు ధనలక్ష్మి, పద్మ, అరుణ, సులోచన, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
41 మందికి కరోనా టీకా
దేవరుప్పుల: మండల కేంద్రంలోని పీహెచ్సీలో గురువారం 41 మందికి కరోనా టీకాలు వేసినట్లు వైద్యాధికారి అశోక్కుమార్ తెలిపారు. 56 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వీరిలో దేవరుప్పులలో ఇద్దరికి, కామారెడ్డిగూడుంలో ఒకరికి, సీతారాపురంలో ఒకరికి, ధర్మాపురం ఒకరికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
గొర్రెల సంపదలో తెలంగాణది మొదటి స్థానం
డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు