హాంగ్కాంగ్: మీడియా టైకూన్, ప్రజాస్వామ్య మద్దతు ఉద్యమకారుడు జిమ్మీ లాయికి మళ్లీ జైలుశిక్షను ఖరారు చేశారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు ఆయనకు శిక్షను వేశారు. 2019 అక్టోబర్ ఒకటో తేదీని లాయితో పాటు అనేక మంది ర్యాలీలో పాల్గొన్నారు. అయితే అక్రమ రీతిలో ప్రదర్శన చేపట్టినందుకు పది మందిని దోషులుగా తేల్చారు. తాజా కేసులో 14 నెలల శిక్షను ఖరారు చేశారు. ఆయనకు ఇతర కేసుల్లోనూ ఇప్పటికే 14 నెలల శిక్ష అమలులో ఉన్నది. హాంగ్కాంగ్లో చట్టాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకున్నది. ఆ చట్టాల ప్రకారమే హాంగ్ కాంగ్ టైకూన్ను అరెస్టు చేసింది. రెండు కేసుల్లో మొత్తం 20 నెలల పాటు జిమ్మీ లాయి జైలులోనే గడపనున్నారు. ద యాపిల్ డెయిలీ పత్రికను స్థాపించిన జిమ్మీ.. హాంగ్ కాంగ్లో సంచలన కథనాలతో చైనాకు హెచ్చరికలు చేశారు.