న్యూఢిల్లీ: గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన హాంగ్కాంగ్ ప్రమాణికుల విమానాల నిషేధిత జాబితాలో మరో దేశం చేరింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉండటంతో ఇండోనేషియా నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధించింది. ఇది రేపటి నుంచి అమలులోకి రానుంది. ఇండోనేషియాలో కరోనా తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి ప్రయాణికుల విమానాలను రద్దుచేస్తున్నట్లు హాంగ్కాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అక్కడ 11,800 కేసులు నమోదవగా, 210 మంది మరణించారు. ఇందులో ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం విశేషం. ఇప్పటికే భారత్, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం అమల్లో ఉన్నది.