ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి
ఆదిలాబాద్ రూరల్, మే 17 : టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. సోమవారం తంతోలి గ్రామంలో ఇటీవల కుమ్ర నారాయణతోపాటు, నక్కల రాజేశ్వర్ అమ్మ మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా రెండు కుటుంబాల సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. కుమ్ర నారాయణ అకాల మర ణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.
బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి..
ఆదిలాబాద్ నుంచి అంకోలి, తంతోలి, మామిడిగూడ వెళ్లే మార్గంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద చేపట్టిన బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. పంచాయతీరా జ్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్తో మాట్లాడారు. వర్షాకాలంలోగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాల మెరుగు కోసం కృషి చేస్తుందన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వైస్ ఎంపీపీ రమేశ్, నాయకులు సెవ్వ జగదీశ్, ఆరె నరేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.