లండన్ : హర్యానాకు చెందిన తల్లీకుమారుడు బ్రిటన్ మేయర్ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. రోహ్తక్కు చెందిన కుటుంబం 2013లో యూకేకు వలస వెళ్లింది. ఇప్పుడు ఈ కుటుంబానికి చెందిన తల్లి పర్వీన్ రాణి, కుమారుడు తుషార్ కుమార్(23) బ్రిటన్లో మేయర్లుగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
తుషార్ కుమార్ ఎల్స్ట్రీ అండ్ బోర్హోమ్వుడ్ టౌన్ కౌన్సిల్కు అత్యంత పిన్నవయస్కుడైన మేయర్గా ఎన్నికవగా, హర్ట్స్మేర్ బరో కౌన్సిల్కు మొదటి భారతీయ సంతతికి చెందిన మేయర్గా పర్వీన్ రాణి ఎన్నికయ్యారు.