పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ : హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మొయిజ్ను తన అధికారిక నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయుధాలతో వచ్చిన కొందరు మొయిజ్ను కాల్చి చంపినట్లు తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ తెలిపారు. అధ్యక్షుడు మరణించిన నేపథ్యంలో తానే దేశానికి ఇంచార్జీగా మారినట్లు ఆయన వెల్లడించారు. దాడిలో గాయపడ్డ అధ్యక్షుడు మొయిజ్ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలంతా సంయమనంతో ఉండాలని జోసెఫ్ అభ్యర్థించారు. పోలీసులు, ఆర్మీ ప్రజల భద్రత చూసుకుంటుందన్నారు. ఇంగ్లీష్, స్పానిష్ భాషలో మాట్లాడే వ్యక్తులు అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు ప్రధాని జోసెఫ్ చెప్పారు. 2018 నుంచి ఆ దేశాధ్యక్షుడి మొయిజ్ కొనసాగుతున్నారు.