ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడు. గీత్సైని కథానాయిక. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కల్యాణం కమనీయం..’ అనే గీతాన్ని శుక్రవారం అగ్ర కథానాయిక సమంత విడుదల చేశారు. ‘అమ్మలాలో పైడి కొమ్మలాలో…ముద్దుల గుమ్మలాలో..’ అనే పల్లవితో సాగే ఈ గీతాన్ని కాసర్ల శ్యాం రచించగా, సిధ్శ్రీరామ్, మంగ్లీ ఆలపించారు. పెళ్లివేడుకను అందంగా దృశ్యమానం చేస్తూ ఈ పాటను తెరకెక్కించారు. శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హెస్టిన్ జోస్ జోసెఫ్, సంగీతం: రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, నేపథ్య సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థ: కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్.