దుబాయ్: కొంత మంది మహిళలు బిల్డింగ్ బాల్కనీ నుంచి నగ్నంగా ఫోజులిచ్చారు. ఒక వ్యక్తి వారిని ఫోటో తీశాడు. ఈ ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని దుబాయ్లో ఈ ఘటన జరిగింది. ముస్లింలు అత్యధికంగా ఉండే, కఠిన చట్టాలు అమలు చేసే ఆ దేశంలో ఇది జరుగడం కలకలం రేపింది. పబ్లిసిటీ కోసం ఆ మహిళలు నగ్నంగా ఫోజులిచ్చినట్లు ఆ దేశ పత్రిక పేర్కొంది.
మరోవైపు ఆ మహిళలను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగించారు. ఇలాంటి ఆమోదయోగ్యంకాని ప్రవర్తనలను ఎమిరేట్ సమాజం సహించదని, ఎమిరేట్ విలువలు, సంప్రదాయాలకు ఇది వ్యతిరేకమని పోలీసులు తెలిపారు. ప్రజా మర్యాద చట్టాలను ఉల్లంఘించిన ఆ మహిళలకు ఆరు నెలల జైలు శిక్ష, భారీగా జరిమానా విధించే అవకాశమున్నదని పేర్కొన్నారు.