అదనపు సెంటర్ల ఏర్పాటుకు అనుమతి
కొత్తగా 19 కేంద్రాల ఏర్పాటుప్రతిపాదనలకు పచ్చజెండా
20 నుంచి ధాన్యం కొనుగోలుప్రారంభానికి సన్నాహాలు
నిర్వాహకులకు నేటి నుంచి శిక్షణ
ఏడు సెక్టార్ల ద్వారా ధాన్యంట్రాన్స్పోర్టుకు ఏర్పాట్లు
వరంగల్రూరల్, ఏప్రిల్ 16(నమస్తేతెలంగాణ) : జిల్లాలో యాసంగి ధాన్యం కొ నుగోలు కేంద్రాల సంఖ్య పెరిగింది. వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన దరిమి లా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలనే ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా మరో 19 కొనుగోలు కేం ద్రాల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటి తో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 194కి చేరింది. ఈ నేపథ్యంలో సో మవారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభించేందుకు అధికారులు స న్నాహాలు చేస్తున్నారు. ఈసారి జిల్లాలో రి కార్డు స్థాయిలో 1,31,656 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగుచేశారు. 3,24,322 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశ ముందని అధికారులు అంచనా వేశారు.
కొనుగోలు కేంద్రాలు ఎక్కడంటే..
ధాన్యం కొనుగోలుకు జిల్లాలో అత్యధికంగా రాయపర్తి మండలంలో 22 కేంద్రాల ఏర్పాటుకు అనుమతి లభించింది. ఆ తర్వా త 17 కేంద్రాలతో పర్వతగిరి మండలం రెండో స్థానం, 16 కేంద్రాలతో నెక్కొండ మూడో స్థానంలో ఉంది. మండలం వారీగా ఖానాపురం, వర్ధన్నపేట, నర్సంపేటలో 14, నల్లబెల్లిలో 13, శాయంపేట, సంగెం లో 12, దుగ్గొండి, చెన్నారావుపేట, నడికూడలో 10, ఆత్మకూరులో 9, పరకాలలో 8, గీసుగొండలో 7, దామెరలో 6 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 194 కొనుగోలు కేంద్రాల నిర్వహణను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు, ఐకేపీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లు, ఎఫ్పీవోలు, జీసీసీకి కేటాయించింది. ఎఫ్పీవోలకు జిల్లాలో 21 కొనుగోలు కేంద్రాలను కేటాయించడం ఇదే ప్రథమం. రైతుల నుం చి కొన్న యాసంగి ధాన్యాన్ని కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్) విధానంపై కేటాయించేందుకు జిల్లాలో రైస్మిల్లులను ఎంపిక చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నేడోరేపో ధాన్యం కేటాయించే రైస్మిల్లుల ఎంపికపై తుది నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని మండలాల్లో వరి కోతలు మొదలైనందున ఈ నెల 20వ తేదీ నుంచి కేంద్రాల్లో ధా న్యం కొనుగోలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కొనుగోలుపై శనివారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో ధా న్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, రైస్మిల్లులకు ధాన్యం కేటాయింపు, ధాన్యం రవాణాపై కలెక్టర్ హరిత అధికారులు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధు లతో సమావేశం నిర్వహించనున్నారు.
రవాణాకు ఏడు సెక్టార్లు..
రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని రైస్మిల్లులకు రవాణా చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు జిల్లాను ఏడు సెక్టార్లుగా విభజించారు. ఈ సెక్టార్లలో ఆత్మకూరు, న ర్సంపేట, ఖానాపురం, పరకాల, వర్ధన్నపే ట, నెక్కొండ, రాయపర్తి ఉన్నాయి. రాయపర్తి, సంగెం మండలాలతో రాయపర్తి, వర్ధన్నపేట, గీసుగొండ మండలాలతో వర్ధన్నపేట, పరకాల, నడికూడ, శాయంపేట మం డలాలతో పరకాల, ఆత్మకూరు, దామెర, న ల్లబెల్లి మండలాలతో ఆత్మకూరు, నెక్కొం డ, పర్వతగిరి మండలాలతో నెక్కొండ, నర్సంపేట, చెన్నారావుపేట మండలాలతో నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి మండలాలతో ఖానాపురం కేంద్రంగా అధికారులు సెక్టార్లను గుర్తించారు. సెక్టార్కో ధాన్యం ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్కు రవాణా బాధ్యతలు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో గాలిదుమారం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..వీడియో
చందూలాల్ మృతి పట్ల మంత్రి తలసాని సంతాపం