దుగ్గొండి, జూలై 8: కరోనా బారిన పడిన పేద కుటుంబాలకు సాయం చేయడం అభినందనీయమని మందపల్లి ప్రత్యేకాధికారి హరిదాస్యం వెంకటేశ్వర్లు అన్నారు. నిరుపేద కుటుంబాలు, వలస కూలీలు, కరోరా బాధిత కుటుంబాలకు లోడి బహుళార్థ స్వచ్ఛంద సంస్థ ఆధ్వరంలో అందించిన నిత్యావసర సరుకులను గురువారం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మొగ్గం మహేందర్, హెచ్ఎం కర్ణకంటి రామ్మూర్తి, లోడి సంస్థ కోఆర్డినేటర్ వీరబాబు, టీం సభ్యురాలు నిర్మల, అంగన్వాడీ టీచర్ గ్రేస్, ఆశ కార్యకర్త రజిత, కారోబార్ బాబురావు, గ్రామ పెద్దలు రంగు వెంకటేశ్వర్లు, అంబరగొండ గోవర్ధన్, బోడ కిరణ్, యూసుఫ్, షాహన్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
పర్వతగిరి: చింతనెక్కొండకు చెందిన కొండి నర్సయ్య మృతి చెందగా, బాధిత కుటుంబానికి సర్పంచ్ గటిక సుష్మ-మహేశ్ రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దర్నోజు దేవేందర్, జీడీ గట్టయ్య పాల్గొన్నారు. అలాగే, జమాలపురంలో గోదారి యాకయ్య కుటుంబానికి సర్పంచ్ పిడుగు రేణుక ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బల్లె మల్లేశం, తోపుచర్ల శ్రీధర్రావు, కొల్లూరి రవి పాల్గొన్నారు.
నిత్యావసరాల పంపిణీ
గీసుగొండ: కరోనా బాధిత కుటుంబాలకు చైల్డ్లైన్ ఆధ్వర్యంలో బహుళార్థ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ విజయపాల్రెడ్డి కోనాయిమాకుల, ఊకల్, మచ్చాపురం, రాంపురం గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ వీరబాబు, నిర్మలామేరీ పాల్గొన్నారు.