న్యూఢిల్లీ : మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు భారీ షాక్ కొట్టింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అంజలి రాయ్, కాంగ్రెస్ నాయకుడు రవీంద్ర సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లో చేరారు. పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే రాఘవ్ చాధా వీరికి టోపీ,0 పట్కా ధరించి పార్టీలోకి స్వాగతం పలికారు. ఆప్లో చేరిన అనంతరం అంజలి రాయ్ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను కలిశారు. వీరు ఇద్దరు పార్టీలో చేరడం ద్వారా వారి అనుభవాల పార్టీకి ప్రయోజనం లభిస్తుందని ఆప్ నాయకుడు రాఘవ్ చాధా అన్నారు.
పంజర్గంజ్ నియోజకవర్గం నుంచి 1998-2008 వరకు రెండుసార్లు కాంగ్రెస్ టికెట్పై అంజలి రాయ్ విజయం సాధించారు. 2004 నుంచి 2006 వరకు ఢిల్లీ జల్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్గా ఉన్నారు. 2000 నుంచి 2004 వరకు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్గా కూడా ఉన్నారు. 1993 నుంచి 1996 వరకు ఆమె అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
కాగా, కరోల్ బాగ్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రవీంద్ర సింగ్.. కాంగ్రెస్ ఎస్సీ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఇద్దరు నాయకులు పార్టీ విధానాలతో కలత చెంది కాంగ్రెస్ నుంచి బయటకొచ్చినట్లుగా తెలుస్తున్నది. వచ్చే ఏడాది జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికలలో వీరి ద్వారా ఆప్ లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయి.
ఇదే సమయంలో, బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర రాష్ట్రాల్లో కేజ్రీవాల్ మోడల్పై పోటీ పడుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ పాలన నమూనా ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి హామీ ఇస్తున్నాయని తెలిపారు.
దేశం పట్ల దృష్టి ఉన్న ఏకైక నాయకుడు కేజ్రీవాల్ అని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. అందువల్లనే ఢిల్లీ దేశవ్యాప్తంగా అభివృద్ధి కొత్త ప్రయోగాలకు ప్రయోగశాలగా మారిందన్నారు. దేశ అభివృద్ధికి బ్లూప్రింట్ ఉంచుతున్న కేజ్రీవాల్కు బీజేపీగానీ, కేంద్ర ప్రభుత్వం గానీ అడ్డంకులు సృష్టించరని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.
ధైర్యం, థ్రిల్, పోటీ స్ఫూర్తి ఉన్న పురుషులే మంచి తండ్రులు
అమెరికాలో కరోనా మహమ్మారి నాలుగో వేవ్..?!
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
బడుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్రలో ఈ రోజు
డైనోసార్ల కలిసి తిరిగిన ఉడుమును కనుగొన్న శాస్త్రవేత్తలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన ముగ్గురు వ్యోమగాములు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..