యూట్యూబ్ ఛానల్ పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తే సహించేది లేదు
కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక అబాండాలు
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్రెడ్డి
కోస్గి, ఏప్రిల్ 12 : అర్థం లేని ఆరోపణలు చేస్తూ యూ ట్యూబ్ ఛానల్ పేరుతో అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని టీఆర్ఎస్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్రె డ్డి అన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థాని క నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఎవరో ఎక్కడో తెలియని ఓ వ్యక్తి తొలివెలుగు యూట్యూబ్ ఛానల్ పేరుతో ఇ క్కడకు వచ్చి ప్రభుత్వ దవాఖానలో ఎవరూ లేని సమయంలో అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు.
గ తంలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి నియోజకవర్గానికి ఏమి ఒరగబట్టాడో ప్రజలకు చెప్పాలన్నారు. అభివృద్ధి చే యలేక మాటలు చెబుతున్నాడనే నిన్ను ప్రజలు ఇంటికి పంపారన్నారు. నకిలీ ఛానల్ పేరుతో ఎమ్మెల్యేపై అబాండాలు వేస్తే తరిమికొ ట్టే రోజులు వస్తాయన్నారు. ఎమ్మెల్యే దవాఖాన పనులు ప్రారంభించాలని రెండు రోజుల కిందట కాంట్రాక్టర్తో మాట్లాడారని, త్వరలోనే పనులు ప్రా రంభమవుతాయన్నారు. నియోజకవ ర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు ఇ వ్వాలని నిరంతరం తపిస్తూ సీఎం కేసీఆర్, మంత్రులను కలిసి వినతిపత్రా లు అందించారన్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సం స్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, పార్టీ పట్ట ణ అధ్యక్షుడు రాజేశ్, కౌన్సిలర్లు, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఓం ప్రకాశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు
ఎమ్మెల్యేపై అబాండాలు వేస్తూ అసత్యాలు ప్రచారం చే స్తే సహించబోమని టీఆర్ఎస్ పార్టీ మద్దూర్ మండలాధ్యక్షుడు వెంకటయ్య అన్నారు. మద్దూర్ మండలంలో షా ఫం క్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధే ల క్ష్యంగా పని చేస్తున్న ఎమ్మెల్యేపై ఓర్వలేక అర్థంలేని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. కార్యక్రమంలో నా యకులు స లీం, శివకుమార్, వీరారెడ్డి పాల్గొన్నారు.