శంషాబాద్ నుంచి గొర్రెకుంటకు సరఫరా
ఐదుగురిని అదుపులోకి తీసుకుని 42 ఇంజెక్షన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఈస్ట్జోన్ డీసీపీ
హన్మకొండ సిటీ/గీసుగొండ, మే10: బ్లాక్ మార్కె ట్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముఠాను గీసుగొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ బోడుప్పల్కు చెందిన ల్యాబ్ టెక్నీషియ న్ చందా విజయ్కుమార్, వరంగల్ రూరల్ జిల్లా దా మెర మండలం ఊరుగొండకు చెందిన చింతం రాజేశ్, హన్మకొండకు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ ముం దాటి గోపాల్, ధర్మారానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ గట్టు అవినాశ్, హన్మకొండలో మెడికల్ షాపు నిర్వహి స్తున్న వావిల సురేశ్ కరోనా చికత్సలో అత్యధికంగా వినియోగిస్తున్న రెమ్డెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్లో అధిక రేట్లకు విక్రయించేందుకు ప్రణాళిక రచించారు. శంషాబాద్లో ఎంఆర్పీకి కొనుగోలు చేసి రూ. 28 వేలకు విక్రయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గీసుగొండ పోలీస్స్టేషన్ పరిధిలోని గొర్రెకుంటలో కరో నా బాధితుడికి ఇంజెక్షన్ను అందించేందుకు ఆదివా రం సాయంత్రం కట్టమల్లన్న గుడి వద్ద వేచి చూస్తున్నా రు. పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరు కోగా పారిపోయేందుకు యత్నించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఇంజెక్షన్లతో బ్లాక్ మార్కెట్లో దందాకు పాల్పడుతున్నట్లు వెలుగు లోకి వచ్చింది. వారి నుంచి 42 ఇంజెక్షన్లతోపాటు రూ. లక్షా 69 వేల నగదు, కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడం లో ప్రతిభ కనబరిచిన మామునూర్ ఏసీపీ నరేశ్, గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు అబ్దుల్ రహీం, రాజు, కానిస్టేబుళ్లు పవన్కుమార్, కిషన్ను సీపీ తరు ణ్జోషి అభినందించారు. కాగా ప్రజాసేన అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పుప్పాల రజినీకాంత్ ఇచ్చిన సమాచారంతో నిందితు లను పట్టుకున్నట్లు తెలిసింది.