వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మృతుడి కుటుంబానికి పార్టీ బీమా చెక్కు అందజేత
వనపర్తి, మార్చి 19 : కార్యకర్తలకు టీ ఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉం టుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని రాజనగరానికి చెందిన తోకల వెంకటయ్యగౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా, వెంకటయ్యకు పార్టీలో క్రియాశీల సభ్యత్వం ఉన్నందున పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల బీ మా చెక్కును శుక్రవారం మంత్రి నిరంజన్రెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి మృతుడి భార్య పార్వతికి అందజేశారు. టీఆర్ఎస్ కార్యక్రమాల్లో వెంకటయ్య చురుకుగా పా ల్గొనేవాడని మంత్రి గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ విజ య్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వై స్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు అలివేల, కృష్ణయ్య, నాగన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిధుల కేటాయింపు హర్షణీయం
స్థానిక సంస్థలైన జిల్లా, మండల పరిషత్ బలోపేతానికి బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మం త్రి క్యాంపు కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి మంత్రి నిరంజన్రెడ్డిని శా లువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర భుత్వం బంగారు తెలంగాణ దిశగా ముం దుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
బీమా చెక్కు అందజేత
గోపాల్పేట, మార్చి 19 : మండలంలోని ఏదుల గ్రామానికి చెందిన టీఆర్ఎ స్ కార్యకర్త బైను గోవిందు (50) కొన్ని నెలల కిందట ప్రమాదవశాత్తు జెర్రిపోతు ల వాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. కాగా, మృతుడికి పార్టీ సభ్యత్వం ఉన్నందున మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును మంత్రి నిరంజన్రెడ్డి మృతుడి కుమారుడు రంజిత్కు అం దజేశారు. అలాగే గ్రామానికి చెందిన పి. నర్సింహకు రూ.60వేలు, ఇందిరకు రూ. 60 వేలు, బి.నర్సింహకు రూ. 27,500 సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశా రు. అనంతరం మాజీ సర్పంచ్ శ్రీనివాసులు పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి పంటను మంత్రి పరిశీలించా రు. ఏదుల రిజర్వాయర్లో 48 ఎకరాల కు సంబంధించి పరిహారం అందాల్సి ఉం దని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా త్వరలోనే ఆదుకుంటామని భరోసా ఇ చ్చారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, నా యకులు తిరుపతి యాదవ్, రఘుయాద వ్, బాలరాజు, నరేందర్, ఆంజనేయు లు, కోటీశ్వర్రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.