ములుగు : సీఎం కేసీఆర్ కొవిడ్ను కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కొవిడ్ విజృంభన ఆపేందుకే లాక్ డౌన్ విధించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఏటూరు నాగారం ఐటీడీఏలో నేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంత్రి సందర్శించారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును ప్రారంభించారు.
ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ యంత్రాన్ని హాస్పిటల్కు అందించారు. హెల్త్ సెంటర్లో అందుతున్న వైద్య సేవలు పరిశీలించారు. రోగులను పరామర్శించి వారితో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉందని ధీమా కల్పించారు. క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ రోగి దగ్గరికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు నిత్యావసరాలు అందించారు.
అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ ఎలా ఉందని విచారించారు. అడవి బిడ్డలకు ప్రభుత్వం అందించే వైద్యంలో ఎలాంటి కొరత ఉండకుండా చూసుకోవాలన్నారు. మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎంపీ మాలోతు కవిత, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ప్రాజెక్టు అధికారి హన్మంతు జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్