లండన్ : కరోనా మహమ్మారి బ్రిటన్వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. నిన్నటి వరకు లాక్డౌన్తో ఇబ్బందిపడిన ప్రజలు.. ఇప్పుడు ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. గత కొన్నిరోజులుగా బ్రిటన్లోని చాలా నగరాల్లోని సూపర్మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాంతో తిండిగింజల కోసం బ్రిటిషర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.
బ్రిటన్లో కరోనా మహమ్మారి సంక్షోభంతో ఆహారం, ఇంధన సరఫరా సమస్య కూడా తలెత్తడం ప్రారంభమైంది. ఇక్కడి సూపర్మార్కెట్లు, ఇతర ఆహార దుకాణాల్లో ఆహార పదార్థాల కొరత ఏర్పడింది. వాస్తవానికి, ఈ మెసేజ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిక యాప్ నుంచి వేలాది మందికి రావడంతో కలకలం చెలరేగింది. గత ఏడాదికి పైగా బ్రిటన్లో కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. దాంతో సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం వల్ల నిత్యవసర వస్తువులు క్రమంగా మార్కెట్ నుంచి కనుమరుగవడం మొదలయ్యాయి. ఫలితంగా సూపర్మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బుధవారం బ్రిటన్లో దాదాపు 44 వేల కేసులు నమోదయ్యాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికావస్తున్నందున త్వరలో వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. అయితే, 10 రోజులు ఒంటరిగా ఉండాలంటూ యాప్ ద్వారా ప్రజలను కోరుతున్న సందేశంతో ఇది పూర్తిగా తప్పు అని తేలిపోయింది. ఈ మెసేజ్ రావడంతో ఆహార సరఫరా, సూపర్ మార్కెట్లు, హాస్పిటాలిటీ, నిర్మాణరంగం, మీడియ రంగాల్లో గందరగోళం నెలకొన్నది. కొందరు భయబ్రాంతులకు గురవకుండా ఉండేందుకు ఈ యాప్ను తొలగించివేశారు. ఇలాఉండగా, బ్రిటన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు 87 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్, 68 శాతం పూర్తి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.
పైకి పెరిగిన భూమి.. హర్యానాలో వింత సంఘటన!.. వీడియో వైరల్..
ఢిల్లీలోని రోహింగ్యా క్యాంప్ను కూల్చిన యోగి సర్కార్.. ఎందుకంటే..?
ఈ శాండ్విచ్ చాలా కాస్లీ గురూ!
తొలి త్రైమాసికంలో అదరగొట్టిన హిందూస్తాన్ యూనిలీవర్
ఉయ్ఘర్ ముస్లింలపై హింసకు చైనా నిర్బంధ కేంద్రాలు
చైనాలో విషాదం.. హైవే టన్నెల్ నీటిలో చిక్కుకుని 13 మంది మృతి
న్యాయం కోసం ఎదురుచూస్తూ చనిపోయిన 108 ఏండ్ల వ్యక్తి
ఢిల్లీలో రైతు పార్లమెంట్.. షరతులతో అనుమతి
చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..