అడిషన్ ఎస్పీ రషీద్
మోమిన్పేట, మే 29: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ ఎస్పీ రషీద్ అన్నారు. శనివారం మండలం కేంద్రంలో లాక్డౌన్ అమలుతీరును, పోలీసులు చేపడుతున్న తనిఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాస్ ఉన్న వాహనాలను తప్ప అనవసరంగా బయటకొచ్చిన వ్యక్తుల వాహనాలను సీజ్ చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ వెసులుబాటు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ప్రజలు తమ పనులపై బయటకు రావాలని, 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశం, ఎస్సై శేఖర్గౌడ్, ట్రైనీ ఎస్సైలు అనిత, సుశీల, కానిస్టేబుళ్లు ఉన్నారు.
బొంరాస్పేటలో..
బొంరాస్పేట, మే 29: మండలంలో లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలుచేస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వగా 10 గంటల తర్వాత లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఎస్ఐ వెంకటనారాయణ ఆధ్వర్యం లో పోలీసులు హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారితో పాటు మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఎస్ఐ వెంకటనారాయణ కోరారు.