పంజాబ్ : పాకిస్థాన్లో మత వేడుక చేసుకుంటున్న షియా ముస్లిం బృందంపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు దుర్మరణం చెందగా.. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్థాన్ తూర్పు ప్రాంతంలోని బావల్నగర్ జిల్లాలో షియా ముస్లింలు మత పరమైన వేడుకలో భాగంగా ఊరేగింపు నిర్వహించారు. జిల్లా జైలు రోడ్డు సమీపంలోకి రాగానే బాంబు పేలడంతో ఐదుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. మహిళలు, చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సహాయ బృందాలు హుటాహుటిన పేలుళ్లు జరిగిన ప్రాంతానికి చేరుకొని బాధితులకు సమీపంలోని దవాఖానకు తరలించారు. తాలిబన్ల మద్దతుదారులు ఈ దురాఘతానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.