లండన్ : ఇంగ్లండ్లోని ప్లేమెత్ సిటీలో శనివారం కాల్పుల కలకలం (Firing @ England) రేగింది. జనాల మధ్య ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులతోపాటు ఓ చిన్నారి ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి కూడా చనిపోయినట్లు తెలుస్తున్నది. బుల్లెట్ గాయాల కారణంగా ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. దవాఖానలో ఒక మహిళ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది ఉగ్ర దాడి కాదని పోలీసులు పేర్కొంటున్నారు. బ్రిటన్లో ఇటువంటి కాల్పుల ఘటనలు చాలా అరుదు అని వారంటున్నారు. ఈ సంఘటన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అదే సమయంలో భద్రత గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన వ్యక్తి తలుపు తట్టి తెరువగానే ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షి 57 ఏండ్ల షెరాన్ టర్నర్ చెప్పారు. నలుపు, గోధుమ రంగు దుస్తులు ధరించిన అతడి వద్ద సెమీ ఆటోమేటిక్ ఆయుధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో కాల్పులు జరిపిన తర్వాత అతడు పక్కనే ఉన్న పార్కులోకి పరుగెత్తి అక్కడ కుక్కలతో వాకింగ్కు వచ్చిన వారిపై కూడా కాల్పులు జరిపాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను కాల్చాడు. ఈ కాల్పులకు గల కారణం ఇంకా ఇంతవరకు స్పష్టం కాలేదు. ఈ సంఘటన పట్ల బ్రిటన్ హోం మంత్రి ప్రీతీ పటేల్ విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబసభ్యులకు ట్విట్టర్ వేదికగా సానుభూతి తెలిపారు. కాగా, 11 ఏండ్ల తర్వాత సామూహిక కాల్పుల సంఘటన జరుగడం ఇదే తొలిసారి. 2010 జూన్ 2 న కేంబ్రియా నగరంలో జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించగా.. 11 మంది గాయపడ్డారు.
నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు మోదీ తాతా..?!
హెలీకాప్టర్ తయారు చేశాడు.. రెక్క తగిలి చనిపోయాడు..
గ్యాస్ సబ్సిడీ అందట్లేదా..? ఇలా ప్రయత్నించండి!
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..