మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు
నిమ్స్లో చేర్పించాలని సూచన
కరీంనగర్ రూరల్: ఏప్రిల్ 2: కాలికి ఇన్ఫెక్షన్తో కదల్లేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న కరీంనగర్ జిల్లా దుర్శేడ్ గ్రామానికి చెందిన అశోక్ అనే నిరుపేద యువకుడికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభయ హస్తం అందించారు. ‘అశోక్ను ఆదుకోండి’ శీర్షికతో ‘నమస్తే’ కరీంనగర్ మినీలో మార్చి 28న ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. వివరాలు తెలుసుకోవాలని తన కార్యాలయ సిబ్బందికి సూచించారు. అశోక్ పరిస్థితిని తెలియజేయాలని వారు శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్థానిక నాయకులను కోరారు. స్పందించిన తెలంగాణ జాగృతి నేత సాయికిశోర్ గౌడ్.. అశోక్ పరిస్థితిని వివరిస్తూ రీట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు అశోక్ను శనివారం నిమ్స్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా జాగృతి నేత సాయికిశోర్గౌడ్ రూ. 25 వేలు అందించారు. వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ మిత్రులు, బ్లూకోల్ట్స్ సిబ్బంది, మరికొందరు దాతలు అశోక్ కుటుంబానికి చేయూతనందించారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం