ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక వీధిపిల్లి తోక కత్తిరించారు. మలాద్ వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటనపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
‘ఆ వీధి పిల్లి ప్రతిరోజూ ఆహారం కోసం మా ఇంటికి వచ్చేది. ఎప్పటిలాగే సోమవారం కూడా మా ఇంట్లోకి వచ్చింది. అయితే దాని తోక తెగపోయి రక్తమోడుతూ కనిపించింది. దాన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించా. అనంతరం మలాద్ వెస్ట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశా’ అని ఆ పిల్లి రక్షించిన వ్యక్తి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ముగిసిన ఎన్నికలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కూలిన మెట్రో రైలు వంతెన.. 13 మంది దుర్మరణం
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రకటించిన స్టాలిన్
తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం.. కరోనాతో ప్రధాన అర్చకులు మృతి