హైదరాబాద్ ఈజిప్టులు అనగానే మనకు పిరమిడ్లు, అందులో దొరికిన మమ్మీలు గుర్తుకొస్తుంటాయి. పరిశోధనల కోసం, మ్యూజియంలో ఉంచేందుకు ఈజిప్టు నుంచి కొన్ని మమ్మీలను పలు దేశాలకు తరలించారు. అందులో మన దేశంలోనూ ఆరు మమ్మీలు ఉన్నాయి. దేశవాప్యంగా మొత్తం ఆరు ఈజిప్టు మమ్మీలుంటే అందులో ఒకటి మన హైదరాబాద్లోనే ఉంది. అది కూడా సాధారణమైనది కాదు. క్రీ.పూ 300 సంవత్సరంలో ఈజిప్టు ఆరో ఫారో కుమార్తె ప్రిన్సెస్ నిషూహు సంబంధించిన మమ్మీగా చెబుతున్నారు. దాదాపు 2500 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ మమ్మీ రాష్ట్ర మ్యూజియంలో 1930 నుంచి ప్రదర్శనలో ఉంటూ వస్తున్నది. ఇంతటి చరిత్ర కలిసిన దీన్ని ఉమ్మడి పాలనలో ఎవరూ పట్టించుకోలేదు. 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో మరో రెండు, మూడు దశాబ్దాల పాటు దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ మమ్మీని కాపాడుకునేందుకు గాజు బాక్సులో భద్రపరిచారు.