భారతీయులపై బ్రిటన్ తాజా నిబంధనలు
లండన్: రెండు డోసుల టీకా వేసుకున్నప్పటికీ, తమ దేశానికి వచ్చే భారతీయులు తప్పనిసరిగా పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని బ్రిటన్ తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం కొవిడ్-19 తాజా ట్రావెల్ రూల్స్ను ప్రకటించింది. ఈ నిబంధనలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. జాత్యహంకారానికి ఇవి నిదర్శనమని మాజీ కేంద్రమంత్రులు జైరాం రమేశ్, శశిథరూర్ మండిపడ్డారు.