డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్
జెనీవా: భారత్లో విస్తరిస్తున్న బీ.1.617 అనే కరోనా వైరస్ స్ట్రెయి న్కు వేగంగా, ఎక్కువగా వ్యాపించే గుణం ఉందని, ఇదే అక్కడ రెండో దశ ఉద్ధృతికి, కరోనా కేసుల విస్ఫో టా నికి ముఖ్య కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. వ్యాక్సినేషన్ వల్ల అభివృద్ధి చెందిన యాంటీబాడీలను బీ.1.617 స్ట్రెయిన్ తప్పించుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలు కరోనా మార్గ దర్శకాలు పాటించక పోవడం కూడా వైరస్ విజృంభణకు కారణమని పేర్కొన్నారు. వైరస్ వ్యాపిస్తున్న కొద్దీ కొత్త రకాలు పుట్టుకొస్తాయని, భారీగా ఉత్పరివర్తనం చెందిన రకాలపై వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేయకపోవచ్చని చెప్పారు.