లండన్: కరోనా సెకండ్ వేవ్ భారత్ను అతలాకుతలం చేస్తున్నది. భారత్లో నెలకొన్న కరోనా సంక్షోభంపై యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఈఐబీ) అధ్యక్షుడు వెర్నర్ హోయెర్ స్పందించారు. ఈయూ బ్యాంక్ సొంత నిధుల నుండి 2,50,000 యూరోలు (రూ.2.22 కోట్లు) భారతదేశానికి అత్యవసర విరాళంగా ప్రకటించారు. భారత్లో సహాయ కార్యక్రమాల కోసం యునిసెఫ్ లక్సెంబర్గ్, రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్, మాల్టెసర్ ఇంటర్నేషనల్కు ఈ నిధులు అందజేస్తామని వెల్లడించారు.