మెదక్ మున్సిపాలిటీ, మార్చి 25 : మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మూడోసారి న్యాక్ గుర్తింపు పొందింది. గత ఫిబ్రవరిలో బెంగళూర్ న్యాక్ బృందం కళాశాలను సందర్శించి పర్యవేక్షించింది. మార్చి 8న కళాశాలకు న్యాక్ ‘బీ’ గ్రేడ్ ప్రకటించింది. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాళాశాల 1985లో ఏర్పాటు చేశారు. అప్పుడు డైట్ కశాశాలలో షిఫ్టింగ్ పద్ధతిన కొనసాగించారు. అనంతరం అప్పటి మెదక్ ఎమ్మెల్యే కరణం రాంచందర్రావు కృషితో 1985-86లో నూతంనగా కళాశాలను తారకరామనగర్లో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. కళాశాలలో ముందు కేవలం బీఏ, బీకాం గ్రూపులే ఉండేవి. అనంతరం బీఎస్పీ ఏర్పాటు చేశారు. కళాశాలకు మెదక్తోపాటు కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ కళాశాలలో విద్యానభ్యసిస్తుంటారు. కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు జాబితాలో చోటు దక్కించుకోవాలన్నా.. కేంద్రం నుంచి నిధులు రావాలన్నా.. న్యాక్ (నేషనల్ అసిస్మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిలర్) గుర్తింపు తప్పనిసరి. ఈ కళాళాలకు ఇప్పటివరకు మూడు సార్లు ‘బీ’ గ్రేడ్ సాధించింది. ప్రతి ఐదేండ్లకు ఒకసారి న్యాక్ బృందం నుంచి మెరుగైన గ్రేడ్ కోసం సంసిద్ధం కావాల్సి ఉంటుంది. తొలిసారిగా 2006లో.. రెండోసారి 2013లో ‘బీ’ గ్రేడ్ సాధించింది. మూడోసారి 2021 మార్చిలో న్యాక్ బృందం కళాశాలను సందర్శించి మార్చి 8న ‘బీ’ గ్రేడ్ సాధించినట్లుగా ప్రకటించింది.
రెండు భవనాల్లో…
డిగ్రీ కళాశాల భవనం తారకరామనగర్లో ఉండగా ఇటీవలే పాత డైట్ కళాశాలలో మరో భవనాన్ని నిర్మించారు. ఈ నూతన భవనంలో బీఏ తరగతులు నిర్వహిస్తున్నారు. పాత భవనంలో బీఎస్సీ, బీకాం తరగతులు నిర్వహిస్తున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో 1700 మంది విద్యనభ్యసిస్తున్నారు. కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్లు ఉన్నాయి.