అంటార్కిటికా దీవుల్లో భూకంపం..

చీలి : అంటార్కిటికాలో శనివారం వరుసగా రెండు సార్లు భూ ప్రంకపనలు వచ్చాయి. దీంతో చిలీలోని ఎడ్వర్డో ఫ్రీ బేస్ వద్ద సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మొదట చిలీ అంటార్కిటిక్ బేస్ సమీపంలో ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రాంతాన్ని సౌత్ సెలాండ్ దీవులు అని కూడా పిలుస్తారు. అయితే ప్రకంపనలతో ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. రాత్రి 8.36 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేందాన్ని చీలికి ఈశాన్యంలో 216 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి తెలిపారు. ప్రకంపనలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో రాత్రి 9.07 గంటల ప్రాంతంలో చీలి - అర్జెంటీనా సరిహద్దులో 5.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. శాంటియాగో నుంచి 133 కిలోమీటర్ల దూరంలో, 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జీఎఫ్జడ్ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ పేర్కొంది.
తాజావార్తలు
- వ్యాక్సిన్ తీసుకున్న సీఎం విజయన్, కేంద్ర మంత్రి హరిదీప్
- కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు.. ముగ్గురి నిర్బంధం
- 2 లక్షల ఖరీదైన టీవీని విడుదల చేసిన ఎల్జీ
- పిచ్ను విమర్శిస్తున్న వాళ్లపై కోహ్లి ఫైర్
- సెక్స్ టేప్ కేసు.. కర్నాటక మంత్రి రాజీనామా
- ఆచార్య శాటిలైట్ రైట్స్ కు రూ.50 కోట్లు..?
- అర్బన్ ఫారెస్ట్ పార్క్కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన
- అమెరికా మిలటరీ క్యాంపుపై రాకెట్ల దాడి
- 50 కోట్ల క్లబ్బులో ఉప్పెన
- ఆయనను ప్రజలు తిరస్కరించారు : మంత్రి హరీశ్రావు