దుబాయ్, జూన్ 20: భారత్తో పాటు పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలను దుబాయ్ సడలించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు రెసిడెన్స్ వీసా ఉండి, యూఏఈ ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకుంటే అనుమతించనున్నది. ఈ సడలింపు ఈ నెల 23 నుంచి అమలులోకి రానున్నది. నాలుగు వ్యాక్సిన్లను యూఏఈ ఆమోదించగా వాటిలో భారత్లో వినియోగిస్తున్న కొవిషీల్డ్, స్పుత్నిక్ కూడా ఉన్నాయి. కరోనా కేసుల ఉద్ధృతితో ఏప్రిల్ చివర్లో భారత్ నుంచి విమానాలను దుబాయ్ నిషేధించింది.