ఇజ్రాయెల్ సైన్యం కొత్త టెక్నాలజీ
జెరూసలేం, జూన్ 21: లేజర్ కిరణాలతో శత్రువుల డ్రోన్లను కూల్చివేయగల టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించామని ఇజ్రాయెల్ సోమవారం ప్రకటించింది. ఒక పౌరవిమానానికి ఈ టెక్నాలజీతో కూడిన సాధనాన్ని అనుసంధానించి పరీక్షించామని, దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న డ్రోన్లను కూడా కూల్చివేశామని ఆ దేశ మిలిటరీ పరిశోధన విభాగం అధిపతి బ్రిగేడియర్ జనరల్ యానివ్ రొటెమ్ తెలిపారు. ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధిపరిచి.. భూమిపైనుంచే ప్రయోగించే విధంగా, 8-10 కిలోమీటర్ల పరిధిలోని రాకెట్లను, మోర్టార్ రౌండ్లను, డ్రోన్లను కూల్చివేసేవిధంగా రూపొందించాలని ఇజ్రాయెల్ భావిస్తున్నది.