్రప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలి
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి టెస్ట్లు చేయాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
ఎదులాపురం, ఏప్రిల్12: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మం దిరంలో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలని ఆదేశించా రు. కొవిడ్ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హు లందరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి, అక్కడే ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్ , 45 ఏళ్లు నిండిన ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకునేలా కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలన్నారు. అదనపు కలెక్టర్( స్థానిక సంస్థల) ఎం.డేవిడ్ మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలు పాటించేలా రెండు, మూడు రోజుల నుంచి గ్రామాలు, పట్టణా ల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై వివరిస్తూ, మాస్క్ల ప్రాధాన్యాన్ని వివరిస్తున్నామని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ… పోలీస్ శాఖ సిబ్బంది టీకా తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానాలు విధిస్తామన్నారు. డీఎంహెచ్వో న రేందర్ రాథోడ్ మాట్లాడుతూ నాలుగు రోజుల నుంచి జిల్లాలో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నదని, ప్రస్తుతం 1777 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పారు. రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ… రిమ్స్లో 350 పడకలు సిద్ధంగా ఉ న్నాయని, 400 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయ ని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో జాడి రాజేశ్వర్, గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, డీపీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.రంజాన్ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో సమావేశం ని ర్వహించారు. పలు సూచనలు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
అభివృద్ధి కి 35 ఏండ్లు చాలదా : జానారెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి సూటి ప్రశ్న
IPL 2021:రాహుల్, హుడా మెరుపులు.. పంజాబ్ భారీ స్కోర్