ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారిపై పోరుకు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన వంతు సాయం చేస్తున్నారు. తన రిఫైనరీలలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను ముంబైకి పంపిస్తున్నారు. గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన రిఫైనింగ్ కాంప్లెక్స్ కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. జామ్నగర్ నుంచి మహారాష్ట్రకు ఉచితంగా ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నట్లు సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు.
అటు మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే కూడా ఈ విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. రిలయెన్స్ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు వస్తోందని ఆయన మరాఠీలో ట్వీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న వేళ హాస్పిటల్స్లో తగినంత ఆక్సిజన్ లేక కొవిడ్ పేషెంట్లు చనిపోతున్నారు. దీంతో తన పెట్రోలియం ఉత్పత్తుల కోసం తయారు చేస్తున్న ఆక్సిజన్లో కొంత భాగాన్ని ఆసుపత్రుల్లో వినియోగించడానికి వీలుగా మార్చి రిలయెన్స్ పంపిస్తోంది.
అటు కేరళలోని కొచ్చిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా 20 టన్నుల ఆక్సిజన్ను సిద్ధంగా ఉంచింది. దీనిని ఆసుపత్రుల్లో ఉపయోగించేందుకు వీలుగా మలచి సరఫరా చేస్తోంది.
ఇవి కూడా చదవండి
లాక్డౌన్లు పూర్తయితే ఈ కుక్కలాగే ఎంజాయ్ చేస్తా: ఆనంద్ మహీంద్రా
మూడు రోజుల్లోనే వ్యాక్సిన్పై డీసీజీఏ నిర్ణయం
కరోనా కేసులు ఇలాగే పెరిగితే ఒలింపిక్స్ రద్దు
ఆనంద్ తండ్రి విశ్వనాథన్ మృతి
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
వ్యాక్సిన్ షాక్: తొలి డోసు కొవాగ్జిన్.. రెండో డోసు కొవిషీల్డ్
ఇంట్లోనే ఉన్నా కరోనా ఎలా వచ్చిందంటున్న స్టార్ హీరో
ఫైవ్ స్టార్ హోటళ్లలో కొవిడ్ బాధితులకు చికిత్స
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ