భోపాల్ : ఓ చిరుత పులి నడిరోడ్డుపై తాపీగా విశ్రాంతి తీసుకుకుంటోంది. అది కూడా వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే మధ్యప్రదేశ్ సియోని జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై చిరుత దర్శనమిచ్చింది. నాలుగు లేన్ల హైవేపై చిరుత విశ్రాంతి తీసుకుంటుండగా.. దాన్ని వాహనదారులు కెమెరాల్లో బంధించారు. వాహనాలన్నీ ఆగిపోవడంతో చిరుత పక్కనున్న ఫెన్సింగ్ను ఎక్కి పారిపోయింది. ఈ హైవేకు అనుకొని పెంచ్ టైగర్ రిజర్వ్ ఉండటంతో.. తరుచుగా చిరుతలు కనిపిస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
దేశంలో అన్ని రాష్ర్టాల్లో కంటే మధ్యప్రదేశ్లోనే చిరుతలు ఎక్కువగా ఉన్నట్లు గతేడాది విడుదల చేసిన నివేదికలో తేలింది. మధ్యప్రదేశ్లో 3,421 చిరుతలు ఉండగా, కర్ణాటకలో 1783, మహారాష్ర్టలో 1690 చిరుతలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ర్టతో పాటు ఉత్తర తెలంగాణలో మొత్తంగా 8071 చిరుతలు ఉన్నట్లు నివేదికలో పేర్కొనడం జరిగింది.