కొవిడ్-2 సంక్షోభ సమయంలో ఎర్రని పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
టమాటా : దీనిలో విటమిన్-సితో పాటు లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
బీట్రూట్ : ఇందులో నైట్రేట్స్ పుష్కలం. ఇవి రక్త ప్రసరణను నియంత్రణలో ఉంచుతాయి.
యాపిల్ : ఈ పండ్లలోని క్యూర్సెటిన్, కేటాచిన్, ఫ్లోరిజిన్, క్లోరోజెనిక్ యాసిడ్ మొదలైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఎర్ర ద్రాక్ష : వీటిలోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తూ, గుండె కండరాలను దృఢ పరుస్తాయి.
ఎర్ర క్యాబేజీ : ఈ రంగు క్యాబేజీలో రక్త కణాల ఉత్పత్తికి సహకరించే ఫొలేట్ అధికం.
క్యారెట్ : ఇందులోని బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ కె1, పొటాషియం వ్యాధుల నుంచి కాపాడుతాయి.
స్ట్రాబెర్రీ : విటమిన్-సితోపాటు ఇతర పోషకాలను
అందిస్తుంది.